రెడ్డిపాలెం గొమ్మూరు వాసుల కు పాలం కృష్ణారెడ్డి సేవలు అమోఘం

 

బూర్గంపహాడ్ జూలై18 (జనంసాక్షి)
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, బూర్గంపహాడ్ మండలం నాగినేని ప్రోలు రెడ్డి పాలెం గోదావరి వరదలు వచ్చిన అప్పటి నుండి రాత్రి పగలు తేడాలేకుండ తనకున్న మూడు ట్రాక్టర్ల సహాయంతో వరద బాధితుల సామాన్లు సురక్షిత ప్రాంతాలకు తరలించడంలో తన వంతు పాత్ర వహించి కాలనీ ప్రజలకు నేనున్నానంటూ భరోసానిస్తూ అనుక్షణం వారి వెంట ఉంటు, వారి కష్టాల్లో పాలుపంచుకుంటున్న ఆయనకు రుణపడి ఉంటాం అంటున్న కాలనీవాసులు. మంచి నీళ్ల కొరతతో ఇబ్బంది పడుతున్న కాలనీవాసులకు ఆదివారం తన వంతు సహాయంగా మినరల్ వాటర్ ట్యాంక్ ను అందించి మరోసారి మానవతాన్ని చాటుకున్నారు. ముంపు బారిన పడిన బాదితులు తమకు సాయం అందించిన పాలం కృష్ణారెడ్డి కి ధన్యవాదాలు తెలియజేశారు.

.