రేపటినుంచి తెలంగాణ ప్రచార యాత్ర: కోదండరాం

మహబూబ్‌నగర్‌: తెలంగాణ మార్చ్‌ను విజయవంతం చేయటానికి రేపటినుంచి 15 తేదీ వరకు సన్నాహక సదస్సులు, ప్రచారయాత్రలు చేపడుతున్నామని తెలంగాణ జేఏసీ ఛైర్మన్‌ కోదండరామ్‌ అన్నారు. మక్తల్‌ నియోజకవర్గంలో తెలంగాణ మార్చ్‌ సన్నాహక సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అందరి ఆకాంక్ష తెలంగాణ రాష్ట్ర సాథనేనని అందుకోసం వివిధ రాజకీయపార్టీలు ఎవరికి వారే ప్రయత్నాలు చేస్తున్నారని ఆయన అన్నారు. తెలంగాణకు కొంతమంది. సీమాంధ్ర పెట్టుబడిదారులే అడ్డుగా ఉన్నారు తప్ప ప్రజలు కాదన్నారు.