రేపటి నుంచి ఆరోవిడత భూపంపిణీ

మహబూబ్‌నగర్‌ : జిల్లాలో ఆరోవిడత భూపంపిణీని ఈనెల 4 నుంచి 10 వరకు నిర్వహించనున్నట్లు ఇన్‌చార్జి సంయుక్త కలెక్టర్‌ భారతీకృతీనాయక్‌ ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని 5 డివిజన్లలో మొత్తం 2,214.29 ఎకరాల భూమిని, 1765 మంది లబ్ధిదారులను గుర్తించినట్లు పేర్కొన్నారు. 1298.29 ఎకరాలకు అసైన్‌మెంట్‌ కమిటీ ఆమోదం తెలిపిందన్నారు. మిగతావి త్వరలోనే పూర్తిచేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఆమె తెలిపారు.