*రేపాల పిహెచ్సి అభివృద్ధికి నిధులు మంజూరు పట్ల హర్షం వ్యక్తం*

మునగాల, సెప్టెంబర్ 20(జనంసాక్షి): రాష్ట్రంలో ప్రజా సంక్షేమమే ధ్యేయంగా టిఆర్ఎస్ ప్రభుత్వం పాలన సాగిస్తుందని తెరాస మునగాల మండల పార్టీ అధ్యక్షుడు తొగరు రమేష్ అన్నారు. మండల పరిధిలోని రేపాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం అభివృద్ధి (మరమ్మత్తులు, నవీకరణ) కొరకు రాష్ట్ర ప్రభుత్వం 12 లక్ష రూపాయలు మంజూరు చేసినట్టు మంగళవారం ఒక పత్రిక ప్రకటనలో తెలిపారు. నిధులు మంజూరు పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఆస్పత్రి నిధులు మంజూరు చేసిన సీఎం కేసీఆర్ ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు, మండల ప్రజల ఆరోగ్యం కోసం ఎమ్మెల్యే మల్లయ్య యాదవ్ కృషికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. మండల ప్రాంత ప్రజలు ఆసుపత్రి సేవలను వినియోగించుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. రాబోయే కాలంలో స్థానిక ఎమ్మెల్యే మల్లయ్య యాదవ్ సహకారంతో మరిన్ని వైద్య సేవలు అందుబాటులో వచ్చేలా కృషి చేస్తామని ఆయన వెల్లడించారు.