రేపు ఎమ్మెల్యే రాములు నాయక్ చేతులు మీదుగా పెన్షన్లు పంపిణీ

జూలూరుపాడు, ఆగష్టు 29, జనంసాక్షి: తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం అర్హులైన లబ్ధిదారులకు నూతనంగా మంజూరు చేసిన పెన్షన్లను వైరా నియోజకవర్గ శాసనసభ్యులు లావుడ్యా రాములు నాయక్ చేతులు మీదుగా మంగళవారం పంపిణీ చేయనున్నారు. ఇందు కోసం పడమట నర్సాపురం గ్రామంలోని రైతు వేదిక ప్రాంగణంలో మధ్యాహ్నం 3 గంటలకు ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నట్లు ఎంపీడీవో తాళ్లూరి రవి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమానికి మండలంలోని అందరు ప్రజాప్రతినిధులు, అన్ని శాఖల అధికారులు, ఉద్యోగులు, ప్రజలు హాజరుకావాలని ఆయన కోరారు.