రైతులకు సకాలంలో ఎరువులు అందిస్తాం బషీరాబాద్

 జూన్ 13, (జనం సాక్షి) బషీరాబాద్ మండల కేంద్రంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో రైతుల కోసం ఎరువులు సిద్ధంగా ఉన్నాయని సీఈఓ వెంకటయ్య తెలిపారు. ఈ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ రైతుల కోసం డి.ఏ.పి 62 మెట్రిక్ టన్నులు తెప్పించమని ఇందులో నుండి ఇప్పటి వరకు 40 మెట్రిక్ టన్నులు ఇచ్చామని మిగతా 22 మెట్రిక్ టన్నులు ఉన్నది. ఒక బస్తా అనగా 50 కీలోలు ధర 1350 రూపాయలకు నేరుగా రైతులకు అందిస్తామని అదే విధముగా యూరియా పది మెట్రిక్ టన్నులు ఉన్నది. యూరియా ఒక బస్తా అనగా 45 కిలోలు ధర 270 రూపాయలకు రైతులకు ఇస్తామని అని చెప్పారు. అదేవిధంగా  జనుము, జిలుగు రైతుల కోసం సిద్ధంగా ఉన్నదని  ప్రతి రైతు ఉపయోగించుకోవాలని తెలిపారు.