*రైతు బంధు కు దరఖాస్తు చేసుకోవాలి*

 తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టి  అమలుచేస్తున్న రైతుబంధు పథకానికి గతంలో దరఖాస్తు చేయని రైతులు 2022-23 సంవత్సరానికి గాను రైతుబంధు పథకానికి దరఖాస్తు చేసుకోవాలని మిర్యాలగూడ మండల వ్యవసాయ అధికారి బి. కళ్యాణ్ చక్రవర్తి రైతులకు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో రైతుబంధు పథకానికి దరఖాస్తు చేయని రైతులు అనగా 2022 సంవత్సరం జూన్ 22వ తేదీ వరకు జారీ చేయబడిన పట్టాదారు పాసు పుస్తకాలు కలిగిన రైతులు మాత్రమే అర్హులు కావున అట్టి రైతులు కొత్తగా రైతుబంధు పథకానికి దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. రైతుబంధు పథకానికి దరఖాస్తు చేసే రైతులు తమ దరఖాస్తుతోపాటు విధిగా పట్టాదారు పాస్ పుస్తకం, ఆధార్ కార్డు, బ్యాంక్ పాస్ పుస్తకం సంబంధించిన జిరాక్స్ కాపీలు జతచేసి సమర్పించాలని ఆయన సూచించారు. పూర్తిచేసిన దరఖాస్తులను రైతులు ఆయా గ్రామాల వ్యవసాయ విస్తరణ అధికారులకు(ఏఈవో )  వీలైనంత త్వరగా అందజేయాలని ఈ సందర్భంగా రైతులకు విజ్ఞప్తి చేశారు.
Attachments area