రైతు బీమా నామిని పత్రాల సేకరణ

 కుబీర్( జనం సాక్షి ) కుబీర్ మండలంలోని పార్డి (బి) గ్రామంలో చిట్యాల యదాబాయి మహిళా రైతు ఇటీవల అనారోగ్యంతో మరణించారు.నామిని చిట్యాల పోషెట్టీ రైతు జీవిత భీమా పత్రాలను ఏఈఓ సాయికృష్ణ కు అందజేశారు. ఈ కార్యక్రమంలో తెరాస జిల్లాప్రధాన కార్యదర్శి తూము రాజేశ్వర్, ఉపసర్పంచ్  తుకారాం,రైతు అధ్యక్షుడు శెరి సురేష్, వార్డు సభ్యులు మిలింద్,వడ్ల లక్ష్మణ్ , కిని శంకర్, కన్నాల శేఖర్ తెరాస నాయకులు జి.ఎన్. స్వామి, మడి రమేష్, గుడాల రాజలింగు, బెల్లల గంగయ్య, నర్సయ్య, ఇoదుర్ ప్రకాష్, కొట్టే గంగాధర్,బ్యాతల శంకర్ తదతరులు పాల్గొన్నారు.