రైతు భీమా నామిని పత్రాల సేకరణ

కుబీర్ (జనం సాక్షి ); కుబీర్ మండలంలోని పార్డి (బి) గ్రామంలో ఆవుల సాయవ్వ మహిళా రైతు ఇటీవల ఆకస్మాతుగా మరణించారు. నామిని తన కుమారుడైన ఆవుల నగేష్ నుండి తెరాస నాయకులు రైతు జీవిత భీమా పత్రాలను ఏఈఓ హరీష్ కు అందజేశారు.త్వరలోనే నామిని పేరిట రూపాయలు 5.00 లక్షలు జామచేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో తెరాస జిల్లాప్రధాన కార్యదర్శి తూము రాజేశ్వర్, ఉపసర్పంచ్  తుకారాం,రైతు అధ్యక్షుడు శెరి సురేష్, కో ఆప్షన్ సభ్యులు కుస్తాపూర్ బాబు,గుడాల రాజలింగు,వార్డు సభ్యులు మిలింద్,వడ్ల లక్ష్మణ్ , కన్నాల శేఖర్ తెరాస నాయకులు ఈర్ల దాత్తత్రి , మడి రమేష్,గడ్దే బాలు దొర్ల లక్ష్మణ్ తుం సాయలు దవుల సంతోష్,నంద్యా మురళి,కొట్టె గంగాధర్,కొట్టె రాజేశ్వర్,ఆవుల గంగాధర్ గ్రామస్తులు పాల్గొన్నారు.