రైతు వేదిక లో చోరీ

చందంపేట (జనం సాక్షి) సెప్టెంబర్ 2

మండలంలో పోలేపల్లి గ్రామపంచాయతీ పరిధిలో ఉన్న రైతు వేదిక భవనంలో నిన్న రాత్రి చోరీ జరిగింది భవనం వెనుక వైపు ఉన్న కిటికీ అద్దం పగలగొట్టి దొంగలు లోపటికి చొరబడి ఫ్యాన్లు కుర్చీలు విలువైన వస్తువులు ఎత్తుకెళ్లారు ఏఈఓ ప్రవీణ్ ఫిర్యాదు మేరకు చందంపేట ఎస్సై యాదయ్య  సంఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేసి కేసు నమోదు చేసుకున్నరు