రైలు కిందపడి కానిస్టేబుల్‌ ఆత్మహత్య

నల్లగొండ,ఆగస్ట్‌30: వ్యక్తిగత కారణాలతో ఓ కానిస్టేబుల్‌ ఆత్మహత్య చేసుకున్నాడు.

నల్గొండ జిల్లా మిర్యాలగూడ రైల్వేస్టేషన్‌ సవిూపంలో ట్యాంక్‌ తండా వద్ద ఈ ఘటన జరిగింది. రైలు కిందపడి శ్రీనివాసచారి అనే కానిస్టేబుల్‌ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తన చావుకు ఎవరూ బాధ్యులు కాదని.. వ్యక్తిగత కారణాలతోనే ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సూసైడ్‌ నోట్‌లో పేర్కొన్నాడు. నల్గొండ జిల్లా కేంద్రానికి చెందిన శ్రీనివాసచారి మిర్యాలగూడలో ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు. ఘటనపై తోటి ఉద్యోగుఉల తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. అతనికి భార్యా ఇద్దరు పిల్లలు ఉన్నారు.