రైల్వే బ్రిడ్జి నిర్మాణం పనులు వెంటనే పూర్తి చేయాలని

కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా
జనం సాక్షి జూన్ 22 మోమిన్ పేట
అర్ధాంతరంగా నిలిపివేసిన  రైల్వే బ్రిడ్జి నిర్మాణ పనులు వెంటనే పూర్తిచేసి రాకపోకలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బుధవారం మోమిన్ పేట కోటిపల్లి మండల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు మోరంగ పల్లి రైల్వే గేటు దగ్గర ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎం శంకర్ యాదవ్ మాట్లాడుతూ రైల్వే బ్రిడ్జి నిర్మాణ పనులకు కాంట్రాక్టర్ అధికారుల నిర్లక్ష్యం కారణంగా నత్తనడకన పనులు జరుగుతున్నాయని మూడు సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటికీ బ్రిడ్జి నిర్మాణం అసంపూర్తి గానే మిగిలిపోయిందని పూర్తి బాధ్యత ప్రభుత్వానిదేనని ఆయన ఆరోపించారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యం కారణంగానే ప్రతి సంవత్సరం వర్షాకాలం వస్తే అరచేతిలో ప్రాణాలు పెట్టుకుని ప్రయాణం చేయాల్సి వస్తుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు 50 మంది ప్రయాణికులతో ఉన్న బస్సు నీటమునిగింది అంటే ఎంత పెద్ద ప్రమాదం తప్పింది అర్థం చేసుకోవాలన్నారు ఇప్పటికైనా రైల్వే అధికారులు ప్రభుత్వ అధికారులు వెంటనే స్పందించి నిర్మాణ పనులను వేగవంతంగా పూర్తి చేసి ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో కోట్ పల్లి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎండి వహేద్ పార్టీ సీనియర్ నాయకులు సిరాజుద్దీన్ చందు పాండు నాయక్ మాన్నయ్య నర్సింలు మహేందర్ ఈ వెంకట్ సర్పంచులు మాజీ సర్పంచులు ఎంపీటీసీ సభ్యులు మాజీ సభ్యులు ఆయా గ్రామాల పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు