రైల్వే వంతెన నిర్మాణానికి రూ. 32కోట్లు మంజూరు

గద్వాల: గద్వాలలో కొత్తగా రైల్వే ఓవర్‌ బ్రిడ్జి నిర్మాణానికి రూ. 32కోట్లు మంజూరయ్యాయని, నిర్మాణపనులు త్వరలోనే ప్రారంభిస్తామని మంత్రి డీకే అరుణ అన్నారు. జమ్మిచెడు గ్రామంలో ప్రాంతీయ జీవనోపాధి శిక్షణా కేంద్రంలో జిల్లా డివిజన్‌ స్థాయి సమీక్షా సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రి డీకే అరుణ, ఎంపీ మందా జగన్నాదం. అలంపూర్‌ ఎమ్మెల్యే అబ్రహం, జిల్లా కలెక్టర్‌ గిరిజా శంకర్‌, ఆర్డీవో నారాయణ్‌ రెడ్డి, జిల్లాస్థాయి అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి డీకే అరుణ మాట్లాడుతూ ఈ నెలాఖరులో గద్వాల్‌ జంక్షన్‌ నుంచి పాండురంగాపురం వరకు కొత్త రైలును ప్రారంభిస్తామన్నారు.