రోగులతో దురుసుగా వ్యవహరిస్తున్న ఫార్మసిస్ట్ పై చర్యలు: డిప్యూటీఎంహెచ్ఓ

దంతాలపల్లి ఆగస్టు 11 జనంసాక్షి

ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో  ఫార్మసిస్ట్ విధులు నిర్వహిస్తున్న చేస్తున్న సోంలా నాయక్ డిప్యూటేషన్ రద్దుచేసినట్లు తొర్రూర్ డిప్యూటీ డిఎంహెచ్ఓ మురళిధర్ తెలిపారు. గురువారం మండల కేంద్రo లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మండల వైద్యాధికారి డాక్టర్ వేదకిరణ్ తో కలిసి విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… విధుల పట్ల అలసత్వం వహిస్తు, రోగులపట్ల దురుసుగా వ్యవహరిస్తున్నట్లు వివిధ పత్రికల్లో వచ్చిన  కథనాలకు స్పందించి ఫార్మసిస్ట్ సోముల నాయక్ పై డిప్యుటేషన్ రద్దు వేటు వేశారు.అతనిని మూడు రోజుల్లో తొలగించి గతంలో పనిచేసిన రవిందర్ కు పార్మాసిస్ట్ బాధ్యత లు అప్పగిస్తామని డాక్టర్ మురళీధర్ తెలిపారు.ఈ కార్యక్రమంలో సి హెచ్ ఓ, వైద్య సిబ్బంది సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.