రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలు
సిద్దిపేట (అర్బన్) సిద్దిపేటలోని రూరల్ పోలిస్ స్టేషన్ సమీపంలో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు గాయపడ్డారు. మండలంలోని బూరుగు పల్లికి చెందిన రాములు. యాదగిరి ద్విచక్ర వాహనంపై సిద్దిపేట వైపు వస్తుండగా పోలిస్ స్టేషన్ దగ్గర చౌరస్తా వద్ద ఓ ప్రైవేట్ పాఠశాల బస్సు వేగంగా వచ్చి ఢీకోంది. గాయపడిన వీరిని స్థానిక అసుపత్రికి తీసుకెళ్లారు. తీవ్రంగా గాయపడిన యాదగిరిని అక్కడినుంచి గాంధీ అసుపత్రికి తరలించారు.