రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మృతి

వెల్దండ: మహబూబ్‌నగర్‌ జిల్లా వెల్దండ మండలం హైదరాబాద్‌-శ్రీశైలం రహదారి పై ఈ ఉదయం కొత్తబస్టాండ్‌ సమీపంలో రెండు ద్విచక్రవాహనాలు ఢీకొని ఇద్దరు మృతి చెందారు. మృతుల్లో ఒకరిని గోపాలపేట మండలం సాకలపల్లి గ్రామానికి చెందిన రమణయ్యగా గుర్తించారు.