రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మృతి

మహబూబ్‌నగర్‌: ఇటిక్యాల మండలం ఎర్రవల్లి చౌరస్తా వద్ద ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు దుర్మరణం చెందారు. ట్రాక్టర్‌ – లారీ ఢీ కొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మృతులను ఇటిక్యాల మండలం తుమ్మాలపల్లి వాసులుగా పోలీసులు గుర్తించారు.