రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి, మరోకరికి గాయాలు

రంగారెడ్డి, సెప్టెంబరు 19 : ఘట్‌కేసర్‌ మండలం జగదాంబ థియేటర్‌ దగ్గర వేగంగా వస్తున్న లారీ స్కూటర్‌ను ఢీకొట్టింది. ఈ సంఘటనలో ఒకరు మరణించారు. ఈ ఘటనలో మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు వచ్చి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం పంపించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.