రోడ్డు ప్రమాదంలో కార్మికుని దుర్మరణం.

బెల్లంపల్లి, డిసెంబర్ 7, (జనంసాక్షి )
బెల్లంపల్లి నియోజకవర్గం తాండూరు మండలం బోయపల్లి బోర్డు వద్ద మంగళవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో బెల్లంపల్లి పట్టణం రడగంబాల బస్తీకి చెందిన సింగరేణి కార్మికుడు సునాని సంతోష్ (31) దుర్మరణం పాలయ్యాడు. బెల్లంపల్లి పట్టణం శాంతిఖని గనిలో ఫిట్టర్ గా పని చేస్తున్న సంతోష్ కు నాలుగు నెలల క్రితం తాండూరు మండలం రేచినికి చెందిన అమ్మాయితో వివాహం జరిగింది. అత్తగారింటికి వెళ్లిన సంతోష్ డ్యూటీ కి వెళ్లాల్సి ఉందని మంగళవారం రాత్రి బయలు దేరగా బోయపల్లి బోర్డు వద్ద ఎదురుగా వస్తున్న బొలెరో వాహనం ఢీ కొనడంతో అక్కడిక్కడే మరణించాడు. యువ కార్మికుడు రోడ్డు ప్రమాదం లో మరణించడంతో శాంతిఖని గనిలో విషాదచ్చాయలు అలుముకున్నాయి. బుధవారం ఉదయం శాంతిఖని వద్ద గని మేనేజర్ సంజయ్ కుమార్ సిన్హా ఆధ్వర్యంలో సంతోష్ మృతి కి మౌనం పాటించి సంతాపం వ్యక్తం చేశారు. ఈకార్యక్రమంలో రక్షణ అధికారి రాజు, ఫిట్ సెక్రటరీలు దాసరి శ్రీనివాస్, దాసరి తిరుపతి గౌడ్, ఏరియా నాయకుడు వెంకట రమణ, అధికారులు, యూనియన్ ప్రతినిధులు, ఉద్యోగులు, కార్మికులు పాల్గొన్నారు