లక్ష్మీ దేవమ్మ భౌతిక కాయం పై పూలమాలలు వేసి నివాళులర్పించిన ఎంపీపీ

మల్దకల్  జులై 21(జనంసాక్షి) మల్దకల్ మండల కేంద్రానికి చెందిన టిఆర్ఎస్ సీనియర్ నాయకుడు పట్వారి బాబురావు మాతృమూర్తి అయిన లక్ష్మీదేవమ్మ (81) అనారోగ్యంతో గురువారం తెల్లవారుజామున పరమపదించారు.ఈ విషయం తెలుసుకున్న మల్దకల్ ఎంపీపీ రాజారెడ్డి, ఆలయ చైర్మన్ ప్రహ్లాద రావు,సింగల్ విండో అధ్యక్షుడు తిమ్మారెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు వెంకటన్న,టిఆర్ఎస్ నాయకుడు తాటికుంట రామచంద్రారెడ్డి,పెద్దపల్లి అజయ్ భౌతికాయంపై పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈయన వెంట టిఆర్ఎస్ నాయకులు పటేల్ జనార్దన్ రెడ్డి,నరేందర్,మధు,జయరాములు,తిమ్మరాజు,బద్రి తదితరులు ఉన్నారు.లక్ష్మీ దేవమ్మ మృతి పట్ల పలువురు ప్రగాఢ సంతాపం సానుభూతి వ్యక్తం చేశారు.
Attachments area