లబ్ధిదారులకు ఎస్సీ కార్పొరేషన్ రుణాల చెక్కులు పంపిణీ

కురివి జూలై
(జనంసాక్షి న్యూస్)

ప్రభుత్వం అందిస్తున్న రుణాలను సద్వినియోగం చేసుకోవాలని ఎంపీడీవో సరస్వతి అన్నారు.మంగళవారం కురివి మండల పరిషత్ కార్యాలయంలో ఎస్సీ కార్పొరేషన్‌ లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేసి మాట్లాడారు.నిరుపేద కుటుంబాలు ఆర్థికంగా ఎదగాలని ప్రభుత్వం రుణాలను అందజేస్తోందన్నారు. రుణాలు పొందిన లబ్ధిదారులు వ్యాపారాలు ఏర్పాటు చేసుకుని ఆర్థికాభివృద్ధి సాధించాలని పేర్కొన్నారు.డోర్నకల్ నియోజకవర్గ శాసనసభ్యులు డిఎస్ రెడ్యానాయక్ సహకారంతో మంజూరైన యస్సి కార్పోరేషన్ రుణాల లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ కార్యక్రమంలో
సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు ఎర్రంరెడ్డి సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ…
సంక్షేమమే ధ్యేయంగా  ఉపాధి కల్పన కై  చేయూత నిచ్చే మహోన్నత పథకం అని కార్పోరేషన్ రుణాలను సద్వినియోగ పర్చుకుని ఆర్థికంగా ఉన్నత స్థితి కి చేరుకోవాలని ఆకాంక్షించారు. అనంతరం పదకొండు మంది లబ్ధిదారులకు ఒక్కొక్కరికి యాభైవేల రూపాయల చొప్పున మొత్తం ఐదులక్షల యాభై వేల రూపాయలు అందించడం జరిగింది.ఈ కార్యక్రమంలో రైతు సమన్వయ సమితి మండల కో ఆర్డినేటర్ ముండ్ల రమేష్,తెరాస యూత్ రాష్ట్ర నాయకులు గుగులోత్ రవి నాయక్,స్థానిక యంపిటిసి చిన్నం భాస్కర్,తెరాస సీనియర్ నాయకులు గాడిపల్లి రాములు,గుగులోత్ లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.