లయన్స్ క్లబ్ లెజెండ్స్ ఆధ్వర్యంలో నిరుపేదలకు అల్పాహారం పంపిణీ

 

పినపాక నియోజకవర్గం జూలై 23 ( జనం సాక్షి): మణుగూరు లయన్స్ క్లబ్ ఆఫ్ లెజెండ్స్ ప్రెసిడెంట్ లయన్ దయానిధి అక్కినేపల్లి వసంతాచార్యులు ఆధ్వర్యంలో ఫ్రీ మీల్స్ ఆన్ వీల్స్ కార్యక్రమాన్ని స్థానిక మణుగూరు వంద పడకల ప్రభుత్వ ఆసుపత్రి డా, కోటేశ్వరరావు ఆసుపత్రి వద్ద రోజువారి కార్మికులకు 150 మందికి అల్పాహారం అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారీ వర్షాల కారణంగా నిరుపేదలు పనులు లేక ఇబ్బంది పడుతున్నారు. కొంతమంది వ్యాధులకు గురవుతున్నారని దీంతో రోజురోజుకు రోగుల సంఖ్య పెరుగుతోంది. ఈ నేపథ్యంలో వారికి అల్ప హారాన్ని అందించాలని సంకల్పంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. లయన్స్ లెజెండ్ ప్రెసిడెంట్ దయానిధి అక్కినేపల్లి వసంతాచార్యులు, లయన్స్ సెక్రటరీ అనంతోజు వెంకటేశ్వరరావు ఆర్థిక సహాయాన్ని అందించారు. కార్యక్రమానికి ఏరియా ఆసుపత్రి సూపరిండెంట్ డాక్టర్ గిరి ప్రసాద్ ,డాక్టర్ కోటేశ్వరరావు , రీజన్ ఛైర్మన్ ఎంఎఫ్జి గంటా రమేష్ బాబు ముఖ్య అతిధులగా పాల్గొని విజయవంతం చేశారు. సేవా కార్యక్రమాల్లో జోన్ చైర్మన్ దుస్సా సమ్మయ్య ,పాస్ట్ రీజన్ చైర్ పర్సన్ గాజుల రమేష్ కుమార్ , లయన్ దూపకుంట్ల రమేష్ , ట్రెజరర్ తాతారావు గారు, నెట్టెం రాధాకృష్ణ , లక్ష్మీ నారాయణ గారు,బొర్రా సాయి కృష్ణ ప్రసాద్(శ్రీ చైతన్య ప్రిన్సిపాల్) తదితరులు పాల్గొన్నారు.