లయన్స్ లెజెండ్ ఆధ్వర్యంలో వాటర్ ట్యాంకర్లతో మంచినీటి సరఫరా

 

పినపాక నియోజకవర్గం జూలై 18 (జనం సాక్షి): మణుగూరు మండలంలోని ముంపు గురైన గ్రామాలలో లయన్స్ లెజెండ్ ఆధ్వర్యంలో లయన్స్ లెజెండ్ అధ్యక్షులు అక్కినేపల్లి దయానిధి వసంత చార్యులు బాధిత కుటుంబాలకు వాటర్ ట్యాంక్ ర్లతో మంచినీళ్ల సరఫరా చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గోదావరి వరద వల్ల రాయిగుడెం కమలాపురం లో తాగునీరు లేక ఇబ్బంది పడటంతో రెండు వాటర్ ట్యాంకర్ లతో మంచినీటిని సరఫరా చేశారు. ఈ కార్యక్రమంలో లయన్స్ లెజెండ్ అధ్యక్షులు అక్కినేపల్లి దయానిధి వసంత చార్యులు ,రీజనల్ అర్ సి గంటారమేష్ బాబు, జెట్ సి దుస్సా సమ్మయ్య సెక్రటరీ అనంతోజు వెంకటేశ్వరరావు పాల్గొన్నారు