లయన్ క్లబ్ లెజెండ్స్ ఆధ్వర్యంలో ఉచిత అల్పాహారం అందచేత

పినపాక నియోజకవర్గం జూలై 22( జనం సాక్షి): మణుగూరు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి, లోని రోగులకు , నిరుపేదలకు లయన్స్ క్లబ్ ఆఫ్ లెజెండ్స్ ప్రెసిడెంట్ లయన్ దయానిధి వసంతా చారి ఆధ్వర్యంలో ఉచిత అల్పాహారాన్ని అందించారు.సందర్భంగా వారు మాట్లాడుతూ ఆసుపత్రి లో. డాక్టర్ గిరి ప్రసాద్ సమక్షంలో వందపడకల. ఆసుపత్రి లోని రోగులకు ఉదయం అల్పాహారాన్ని పంపిణీ చేశారు.ఆ తర్వాత మణుగూరు అంబేద్కర్ సెంటర్ ,సురక్ష బస్టాండ్ సెంటర్లో బిచ్చగాళ్ల కు వృద్ధులకు 150 మందికి పైగా అల్పాహారాన్ని అందించారు. రీజియన్ చైర్మన్ ఎం జ ఎఫ్ గంటా రమేష్ బాబు తన సొంత ఖర్చులతో ఏర్పాటు చేశారు. వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో డాక్టర్ గిరిప్రసాద్, జోన్ చైర్మన్ దుస్సా సమ్మయ్య , పాస్ట్ రీజన్ చైర్ పర్సన్ గాజుల రమేష్ కుమార్ క్లబ్ సెక్రటరీ ఏ. వెంకటేశ్వరరావు, లయన్ దూపుకుంట్ల రమేష్ , ట్రెజరర్ తాతారావు, నెట్టం రాధాకృష్ణ మరియు హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు.