లస్మన్నపల్లిలో వైద్య శిబిరం

-వ్యాక్సినేషన్ కార్యక్రమం
******
సైదాపూర్ జనం సాక్షి సెప్టెంబర్ 10 మండలంలోని లస్మన్నపల్లి గ్రామంలో శనివారం ప్రత్యేక వైద్య శిబిరం నిర్వహించారు. అలాగే కరోనా బూస్టర్ డోస్ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ కాయిత రాములు మాట్లాడుతూ.. పల్లె దావఖాన ఏర్పడిన నాటి నుండి గ్రామంలో ప్రతి నెలలో రెండవ,నాల్గవ శనివారాలలో గ్రామంలో ప్రత్యేక వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రజలు ప్రైవేట్ ఆస్పత్రుల చుట్టూ తిరగకుండా ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న ఈ వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. నెలలో రెండు రోజులు ఏర్పాటు చేస్తున్న ఈ వైద్య శిబిరంలో పిల్లల నుండి వృద్ధుల వరకు రక్త పరీక్షలు చేసి మందులను పంపిణీ చేస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో పల్లే దావఖాన వైద్యులు కృష్ణారావు, హెల్త్ అసిస్టెంట్ లక్ష్మణ్,ఏఎన్ఎం ఇందిరా, ఆశా కార్యకర్త నిర్మల గ్రామస్తులు పాల్గొన్నారు.