లారీనీ ఢీకొన్నడీసీఎం: ఇద్దరు మృతి

మహబూబ్ నగర్: ఫరూక్ నగర్ మండలం రాయకల్ టోల్ ప్లాజా వద్ద జాతీయ రహదారిపై అనంతపురం నుంచి హైదరాబాద్ వెళ్తున్న లారీని డీసీఎం వ్యాను ఢీకొంది. ఈ ప్రమాదంలో వ్యానులోని ఇద్దరు మహిళలు మృతి చెందారు. మృతులు అనంతపురం జిల్లాకు చెందిన వారిగా గుర్తించారు.