లారీ, జీపు ఢీ : ఇద్దరు మృతి

మహబూబ్‌నగర్‌ : లారీ, జీపు ఢీకొన్న సంఘటనలో ఇద్దరు మృతిచెందారు. జిల్లాలోని మక్తల్‌ మండలం బొందలకుంటలో లారీ, జీపు ఢీకొని ఇద్దరు దుర్మరణం చెందారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. వీరిలో ఇద్దరి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది.