లారీ ఢీకొని ఉపాధ్యాయుడు మృతి

నల్గొండ క్రైం: నల్గొండ మండలం మర్రిగూడ గ్రామ సమీపంలో బుధవారం లారీ ఢీ కొని ఉపాధ్యాయుడు మృతిచెందాడు. ఈ ప్రమాదంలో ఉపాధ్యాయుడు ఆళ్లకుంట్ల సూర్యకిరణ్‌ (26) అక్కడికక్కడే మృతి చెందాడు. పట్టణంలోని పానగల్‌ కు చెందిన ఆయన మోత్కురు మండల కేంద్రంలోని పాఠశాలలో ప్రధాన ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. బుధవారం ఉదయం విధులకు హాజరవడానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. నల్గొండ రూరల్‌ పోలీసులు లారీ డ్రైవరును అదుపులోకి తీసుకుని కేసునమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.