లెఫ్ట్‌ నేత నల్లాని స్వామికి సీతక్క నివాళి

ములుగు,జులై24(జ‌నంసాక్షి): ములుగు  మండలం పంచోత్కులపల్లి గ్రామానికి చెందిదిన లెఫ్ట్‌ పార్టీకి చెందిన సీనియర్‌ నాయకులు  నల్లాని స్వామిరావు  చనిపోగా  ములుగు ఎమ్మెల్యే సీతక్క ఆయన భౌతిక కాయానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. వారి కుటుంబాన్ని పరామర్శించారు. అలాగే ములుగు మండలం మల్లంపల్లి గ్రామనికి చెందిన కొత్తపల్లి వెంకటయ్య ఇటీవలే చనిపోగా ఆయన  కుటుంబాన్ని సీతక్క పరామర్శించారు. ఎమ్మెల్యే సీతక్క వెంట  న్లలెల్ల కుమారస్వామి ,కిసాన్‌ సెల్‌ అధ్యక్షులు రాజేందర్‌ గౌడ్‌,మండల యూత్‌ అధ్యక్షులు రవి చందర్‌,గోల్కొండ రవి,ఉప సర్పంచ్‌  శ్రీకాంత్‌ రెడ్డి,శ్యామ్‌ రావు,బండి.శ్రీను,రామ్‌ రెడ్డి,చందా రాము,శ్రీకాంత్‌,అనిల్‌ రెడ్డి, ఐలయ్య, రవి,నరేందర్‌,రాకేష్‌, కుమార్‌ తదితరులు ఉన్నారు.