లేగ దూడను చంపిన చిరుత

calf killed by leopard

రంగారెడ్డి : కుల్కచర్ల మండలం అనంతసాగర్‌లో చిరుత సంచరిస్తోంది. ఓ లేగ దూడను చిరుత చంపి తినేసింది. చిరుత సంచారంతో గ్రామస్థులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ప్రజలు తమ నివాసాల నుంచి బయటకు వచ్చేందుకు భయపడుతున్నారు. చిరుత గ్రామంలో సంచరిస్తున్న విషయాన్ని గ్రామస్థులు అటవీశాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.