లేబరు కార్డులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే రాజ య్య

-కార్మికులకు లేబర్ ఇన్సూరెన్స్ కార్డులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే రాజయ్య
లింగాల ఘన్పూర్,     ( జనం సాక్షి ):
మండలంలోని నెల్లుట్లలో   భ్రమరాంబ కన్వెన్షన్ నందు టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకుడు,జనగామ జిల్లా కబడ్డీ అసోసియేషన్ చైర్మన్, చిట్ల ఉపేందర్ రెడ్డి జన్మదినం సందర్భంగా నిర్వహించిన జన్మదిన వేడుకలలోతెలంగాణ తొలి ఉపముఖ్యమంత్రి , ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య ముఖ్య అతిథిగా హాజరైనారు.ఈ సంద ర్భంగా ఉపేందర్ రెడ్డి ని శాలువాతో సన్మానించి , ఉపేందర్ రెడ్డి చేత  బర్త్-డే-కేక్ కట్ చేయించి ఉపేందర్ రెడ్డి ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాల తో ఉండాలని తను అనుకున్న స్థాయికి ఎదుగా లని ఎమ్మెల్యే  మనసారా ఆకాంక్షించి హృదయ పూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా అసంఘటిత రంగంలో పని చేసే 1000 మంది కార్మికులకు చిట్ల జయశ్రీఉపేందర్ రెడ్డి తమ స్వంత ఖర్చులతో లేబర్ ఇన్సూరెన్స్ చేపించిన లేబర్ ఇన్సూరెన్స్ కార్డులను ఎమ్మెల్యే రాజయ్య చేతుల మీదుగా 1000 మంది కార్మికు లకు పంపిణీ చేశారు. ఉపేందర్ రెడ్డి స్వతహాగా కబడ్డీ ప్లేయర్ అయినందున కిబడ్డీ ఆడే క్రీడాకారు లను ప్రోత్సహించడం , కరాటే , త్వయికండో ఆడే వారిని కూడా ప్రోత్సహిస్తుంటారని అంతేకాకుండా నిరుపేద కుటుంబాలకు చెందిన అసంఘటిత కార్మికులకు లేబర్ కార్డు అందజేయడం జరిగింది అన్నారు.చిట్ల జయశ్రీఉపేందర్ రెడ్డి రాజకీయంగా ఒక ప్రజాప్రతినిదిగా ప్రజలకు సేవ చేయడమే కాకుండా అదనంగా సేవ కార్యక్రమాలు చేయడం అభినందనీయమని తెలిపారు.ఈ కార్యక్రమంలో  నియోజకవర్గంలోని ఎంపీపీలు , జడ్పీటీసీలు , మండల పార్టీ అధ్యక్షులు , సర్పంచుల ఫోరం మండల అధ్యక్షులు , సర్పంచులు , ఎంపీటీసీలు , ముఖ్య నాయకులు , ఇతర నామి తదితరులు
Attachments area