వనపర్తి సభ ఏర్పాట్లను పరిశీలించిన టిఆర్‌ఎస్‌ నేతలు

వనపర్తి,సెప్టెంబర్‌28(జ‌నంసాక్షి ): అక్టోబర్‌ 5న వనపర్తి నియోజకవర్గంలో జరిగే  టీఆర్‌ఎస్‌ ఎన్నికల ప్రచార సభా ఏర్పాట్లను మంత్రి లక్ష్మారెడ్డి పరిశీలించారు. ఆయన వెంట ఎంపీ జితేందర్‌ రెడ్డి, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు నిరంజన్‌ రెడ్డి, ఎమ్మెల్యేలు ఆలా వెంకటేశ్వర రెడ్డి, అంజయ్య యాదవ్‌ తదితరులు ఉన్నారు. తెలంగాణ అసెంబ్లీ రద్దు అనంతరం అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ ఎన్నికల ప్రచార జోరు పెంచింది. ఈ నేపథ్యంలో కేసీఆర్‌ ఉమ్మడి నియోజక వర్గాల ఎన్నికల ప్రచార సభలను ప్రకటించారు. అక్టోబర్‌ 3 తేదీ నుండి ఈ సభలు ప్రారంభం కానున్నాయి. తర్వాత అక్టోబర్‌ 5న వనపర్తి నియోజకవర్గ లో జరిగే సభ ఏర్పాట్లను పరిశీలించారు.