వరంగల్ జిల్లాలో దారుణం

1chflaiaవరంగల్]

వరంగల్ జిల్లాలోని చెన్నారావుపేట మండలం ఖాదర్‌ గుట్ట వద్ద దారుణం జరిగింది. అటవీ ప్రాంతంలో ఇద్దరు బాలికల మృతదేహాలు లభ్యం కావడం కలకలం రేగింది. వారిద్దరిని అతికిరాతంగా నరికి చంపినట్లు సమాచారం. ఘటన జరిగిన ప్రాంతంలో దుర్వాసన రావడంతో గ్రామస్థులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. మృతులు ఇరువురు నల్లబెల్లి మండలం చెక్కలపల్లి గిరిజన వసతి గృహంలో 9వ తరగతి చదువుతున్న భూమిక, ప్రియాంకగా గుర్తించారు. ఈ ఇద్దరు హాస్టల్‌ నుంచి అదృశ్యమైనట్లు గత నెల 23న పోలీసులకు ఫిర్యాదు అందింది. ఇద్దరు హాస్టల్‌ విద్యార్థినుల హత్య ఘటన సంచలనంగా మారింది.