వరంగల్ లో గోడ కూలి ఇద్దరు దుర్మరణం

వరంగల్ ఈస్ట్ ,జూలై 23( జనం సాక్షి)
వరంగల్ మహా నగరంలోని బజార్ లో గోడ కూలి ఇద్దరు దుర్మరణం చెందగా ఒకరికి గాయాలైన సంఘటన శుక్రవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. నిరంతరం కురుస్తున్న వర్షాల కారణంగా మండి బజార్ లో ఉన్న గోడ నాని కూలిపోగా పైడి (60), ఫిరోజ్ (20)ఇద్దరు దుర్మరణం చెందారు .అదేవిధంగా సమ్మక్క అనే మహిళ గాయాలు కాగా హాస్పిటల్ కు తరలించినట్లు స్థానికులు తెలిపారు. శిధిలావస్థలో ఉన్న గృహాలలో ప్రజలు ఉండకుండా సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సంబంధిత అధికారులు ప్రజలను కోరుతున్నారు.
 
Attachments area