వరద బాధితులకు ఈనెల 30న నిత్యావసర సరుకులు, బియ్యం పంపిణీ

పినపాక నియోజకవర్గం జూలై 27 (జనం సాక్షి): రాజ్య సభ సభ్యులు పార్డసారది రెడ్డి సౌజన్యంతో ప్రభుత్వ విఫ్ రేగా కాంతారావు  ఆధ్వర్యంలో పినపాక నియోజకవర్గంలోని అశ్వాపురం మండలం పాములపల్లి, కుమ్మరిగూడెం గ్రామాలల్లోని గోదావరి వరద బాధితులకు ఈ నెల 30 న నిత్యావసర సరుకులు, బియ్యం పంపిణీ చేయనున్నట్లు మణుగూరు  జెడ్పీటీసీ     పోశం నరసింహ రావు బుధవారం విలేఖర్ల సమావేశంలో తెలిపారు. ఆయన మాట్లాడుతూ వరద ముంపుకు గురైనా బాధితులకు తెరాస ప్రభుత్యం అండగా ఉంటుందని వారిని అన్ని విధాలా ఆదుకుంటామని తెలిపారు. ఈ పంపిణీ కార్యక్రమానికి మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ,రాజ్యసభ సభ్యులు పార్థసారధి రెడ్డి , వద్దిరాజు రవిచంద్ర , ఎంపీలు  నామా నాగేశ్వరరావు  మాలోత్ కవిత ,  ఎమ్మెల్సీలు  పల్లా రాజేశ్వర్ రెడ్డి ,తాతా మదు , ఉమ్మడి ఖమ్మం జిల్లా ఎమ్మెల్యేలు, జెడ్పీ చైర్మన్ లు,జిల్లా నాయకులు హాజరు కానున్నారు. ఈ కార్యక్రమానికి ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు.
Attachments area