వరద బాధితులకు లక్ష విరాళం

చండ్రుగొండ జనంసాక్షి (జులై  24) : గోదారి వరదల్లో సర్వం కోల్పోయిన  బాధిత కుటుంబాలను  ఆదుకునేందుకు చండ్రుగొండ,అన్నపురెడ్డిపల్లి   మండలాల ఉపాధ్యాయులు లక్ష రూపాయల విరాళాన్ని సేకరించారు. ఈ మొత్తాన్ని  ఉమ్మడి మండల విద్యాశాఖ అధికారి  సత్యనారాయణ చేతుల మీదుగా  ఆదివారం బాధిత కుటుంబాలకు   అందజేశారు.ఈ సందర్బంగా  ఎం ఈవో మాట్లాడుతూ ఆపదలో ఉన్న వారిని ఆదుకునే ఆలోచన ఎంతో గొప్పదన్నారు. దుమ్ముగూడెం మండలం  లక్ష్మీ నారాయణ పేట లోని 33 బాధిత కుటుంబాలకు క్వింటా బియ్యం, లక్ష రూపాయలను  అందించామన్నారు. ఈ కార్యక్రమంలో  దుమ్ముగూడెం మండల విద్యాశాఖ అధికారి  సమ్మయ్య, ఉమ్మడి మండలాల ఉపాధ్యాయులు  ఇస్లావత్ వీరన్న,దేవా రామ్, ఆరీఫ్ హుస్సేన్, భాస్కర్  రాములు శ్రీనివాస్ ప్రభాకర్  తదితరులు పాల్గొన్నారు.
Attachments area