* వరద బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలి.

*కాంగ్రెస్ మహిళా జిల్లా అధ్యక్షురాలు గుమ్మడి శ్రీదేవి.
చిట్యాల17(జనంసాక్షి)ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా జిల్లావ్యాప్తంగా ఎంతోమంది ప్రజలు, రైతులు నష్టపోయారని  ఇండ్లు కూలిన వరద బాధితులకు ప్రభుత్వం తక్షణమే ఆర్థిక సాయం అందజేయాలని భూపాలపల్లి జిల్లా కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు గుమ్మడి శ్రీదేవి అన్నారు. గత వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా మండలంలోని వివిధ గ్రామాల్లో ఆమె పర్యటించి బాధితులను పరామర్శించారు.అనంతరం ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా రైతుల పంటలు పూర్తిగా ద్వంసం అయ్యాయని, వరద తాకిడికి ఇండ్లు కూలిపోయాయి. రోడ్లు ధ్వంసం అవడంతో రాకపోకలు నిలిచిపోయాయి. తక్షణమే ప్రభుత్వం స్పందించి సహాయక చర్యలు చేపట్టాలని, నష్టపోయిన ప్రజలకు ఇల్లు నిర్మాణం చేయించాలని, ప్రభుత్వ అధికారులు సర్వే చేసి నష్టపోయిన ప్రజలకు ఆర్థిక సహాయాన్ని అందించాలని  ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.