వరికోలు గ్రామంలో యువకుల ర్యాలీ

వరంగల్‌ రూరల్‌,అక్టోబర్‌19(జ‌నంసాక్షి):  జిల్లాలోని నడికుడి మండలంలోని వరికోల్‌ గ్రామంలో ఐక్యతే మా బలం.. అభివృద్దే మా ధ్యేయం.. అంటూ గ్రామానికి చెందిన ఉద్యోగులు, యువత వరికోలు నుంచి శుక్రవారం ఉదయం బైక్‌ ర్యాలీ నిర్వహించారు. కేసీఆర్‌ మళ్లీ సీఎం కావాలి.. తెలంగాణ భవిష్యత్‌ కేసీఆర్‌ అంటూ ర్యాలీలో నినాదాలు చేస్తూ ముందుకు సాగారు. వరికోలు నుంచి నార్లపూర్‌, వెంకటేశ్వర్లపల్లి, పులిగిల్ల, చర్లపల్లి గ్రామాలలో వీధివీధిన బైక్‌ ర్యాలీ నిర్వహించారు. పోచంపల్లి శ్రీనివాస్‌ రెడ్డి నేతృత్వంలో వరికోల్‌ గ్రామం అభివృద్ధి చెందిందని ఇలాగే నియోజకవర్గంలోని అన్ని గ్రామాలు అభివృద్ధి చెందాలని కాంక్షిస్తూ సుమారు రెండు వందల బైక్లతో బైక్‌ ర్యాలీ చేపట్టినట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ మల్టీ నేషనల్‌ కంపెనీల సాప్ట్వేర్‌ ఉద్యోగులు, యువత పాల్గొన్నారు.