వర్షాలకు దెబ్బతిన్న గృహాన్ని పరిశీలించిన మేయర్

29 వ డివిజన్ రామన్న పేట లో పర్యటన
వరంగల్ ఈస్ట్, జూలై 14(జనం సాక్షి):
  గత ఐదు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు దెబ్బతిన్న గృహాన్ని గురువారం నగర మేయర్  గుండు సుధారాణి 29 వ డివిజన్ రామన్న పేట లో క్షేత్ర స్థాయి లో పరిశీలించారు.
   రామన్నపేట లో నివాసం ఉంటున్న పాక రాజమణి కి చెందిన ఇల్లు  పాక్షికం గా దెబ్బతినడం తో బాధితురాలి స్వగృహానికి వెళ్లి అట్టి గృహాన్ని  పరిశీలించి బాదితురాలికి ధైర్యం చెప్పి ప్రభుత్వ పరంగా వచ్చే పరిహారాన్ని అందేలా చూడాలని తహసీల్దార్ ను మేయర్ ఆదేశించారు.
     ఇట్టి కార్యక్రమంలో తహసీల్దార్ సత్యపాల్ రెడ్డి,వి.ఆర్.ఓ.విజయేందర్ రెడ్డి, డివిజన్ అద్యక్షుడు కే.సదంత్, ఎండి షఫీ, పూజారి కుమారస్వామి, తాళ్లపల్లి రమేష్,  రాజయ్య, లలిత, రాజు, క్రాంతి  స్థానికులు పాల్గొన్నారు.