వారసంతలోకి బారి వాహనాల రాకపోకలతో ట్రాఫిక్ ఇబ్బందులు.

రాయికల్, నవంబర్ 11(జనంసాక్షి)రాయికల్ పట్టణంలో ప్రతి శనివారం వారసంత జరుగుతుంది.
రాయికల్ చుట్టూ పక్కల గ్రామాల నుంచి కాక సుదూర అటవీ గ్రామాల నుండి కూడా ప్రజలు అధిక సంఖ్యలో సంతకు వచ్చి నిత్యవసర వస్తువులను కొనుగోలు చేసి తీసుకవెళ్తూ ఉంటారు.
పోలీసులు,మున్సిపల్ అధికారులు ఆటోలు,
కార్లు,ఇతర బారి వాహనాలు సంతలోకి రావద్దని ఆదేశాలు జారీ చేసిన కార్లు,ఆటోలు ఇతర వాహన దారులు పట్టించుకోవడం లేదని, ఇలా ప్రతి వారం సంతలో ట్రాఫిక్ సమస్యతో ఇటు ప్రజలు, అటు వర్తకదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు