వాహనదారులు విధిగా హెల్మెట్ ధరించాలి

-వరంగల్ ట్రాఫిక్ ఏసీపీ మధుసూదన్
వరంగల్ ఈస్ట్, జూలై 15(జనం సాక్షి):
వాహనదారులు తప్పకుండా హెల్మెట్ ధరించి వాహనాలను నడపాలని వరంగల్ ఏసిపి మధుసూదన్ అన్నారు. శుక్రవారం వరంగల్ నగరంలోని ఎంజీఎం జంక్షన్ లో హెల్మెట్ లేని మరియు నెంబర్ ప్లేట్ లేని వాహనదారులకు అవగాహన  కార్యక్రమం నిర్వహించారు . హెల్మెట్ లేని వాహనదారులు హెల్మెట్ కొనుక్కొని ధరించాలని, ప్రమాదాల బారి నుండి కాపాడుకోవాలని ఏ సి పి అన్నారు .అలాగే నంబర్ ప్లేట్ లేని వాహనదారులు నంబర్ ప్లేట్స్ వేసుకోవాలని సూచించారు .ఇట్టి కార్యక్రమంలో దాదాపు100 మంది వాహన దారులు పాల్గొన్నారు. నంబర్ ప్లేట్ లేని హెల్మెట్ లేని వాహనాలకు జరిమానా విధించారు.. ట్రాఫిక్ ఎస్ఐ రామారావు , మరియు సిబ్బంది పాల్గొన్నారు.