విఆర్ఏ లకు పేస్కెల్ అమలు చేయాలి

జుక్కల్, జూలై28,జనంసాక్షి,
విఆర్ఏ లకు ప్రభుత్వం వెంటనే పేస్కెల్ అమలు చేయాలని సిఐటియు కామారెడ్డి జిల్లానాయకులు సురేష్ గొండ డిమాండ్ చేశారు. ఆయన గురువారం కామారెడ్డి జిల్లా పెద్ద కొడప్ గల్ మండలకేంద్రంలో విఆర్ఏ ల నిరవధిక సమ్మె శిబిరాన్ని సందర్శించి మద్దత్తు తెలిపారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతు ప్రభుత్వం అర్హులైన విఆర్ఏ లకు పదోన్నతులు కల్పించాలని,వయస్సు పైబడిన విఆర్ఏ వారసులకు వారి స్థానములో ఉద్యోగ అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ విఆర్ఏ లకు హామిలిచ్చి అమలు పరచకుండా కాలయాపన చేస్తున్నారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో విఆర్ఏల నాయకులు షేఖ్ లియాకత్, నాగయ్య, విఆర్ఏ లు పాల్గొన్నారు.