విత్తనబంతులు వినియోగించుకోవాలి

జనగామ,జూలై3(జ‌నంసాక్షి):  జిల్లాలో అడవుల విస్తీర్ణం పెంచేందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు కృషి చేయాలని అటవీ అధికారి అన్నారు. ప్రధానంగా విత్తన బంతులను వినయోగించుకోవాలని సూచించారు. విత్తనబంతులు, హరితహారంలో ప్రధానంగా ఉండబోతున్నాయని అన్నారు. ప్రతీగ్రామంలో విత్తనబంతులు వేయాలని, హరితహారంలో చెట్లను నాటుకోవాలని పిలుపునిచ్చారు. గ్రామాలలో విత్తనబంతుల కార్యక్రమం ప్రారంభిస్తామని గ్రామంలోని ప్రభుత్వభూమిలో, అసైండ్‌ ల్యాండ్‌లో, కుంటలలో, పొలంగట్లపై, రోడ్డుకు ఇరువైపులా విత్తన బంతులను, మొక్కలను నాటుకోవాలని తెలిపారు.