విద్యను అందించడంలో ప్రధానోపాధ్యాయులు కృషి చేయాలి
మెదక్, జనవరి 31 (): విద్యార్థులను నాణ్యమైన విద్యను అందించడానికి ప్రధానోపాధ్యాయులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ ఎ.దినకర్బాబు అన్నారు. గురువారం కలెక్టరేట్ ఆడిటోరియంలో వివిధ పాఠశాలల ప్రధానోపాధ్యాయులతో ఏర్పాటు చేసిన సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయుల సమిష్టి కృషితో విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలని ఆయన సూచించారు. విద్యార్థుల ప్రతిభను బట్టి ఎ,బి,సి,డి కేటగిరిలుగా విభజించి శ్రద్ధ వహించాలన్నారు. నూటికి నూరుశాతీం ఉత్తీర్ణత సాధించాలని అన్నారు. 9, 10తరగతుల విద్యార్థులు ఆధార్కార్డులు పొందెందుకు 2 లేదా 3 వసతి గృహాలు కలిపి ఒక ఆధార కేంద్రం ఏఆర్పటు చేయడం జరుగుతుందన్నారు. ఈ ఆధార్ కేంద్రాలలో ఉపకారవేతనాలు పొందే విద్యార్థులు ఆధార్ కేంద్రంలో బయోమెట్రిక్ వివరాలను నమోదు చేసుకునే విధంగా ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు సహకరించాలని అన్నారు. ఈ సమావేశంలో డిఈఓ రమేష్, ఉపవిద్యాధికారలుఉ, ఆయా మండల విద్యాధికారులు తదితరులు పాల్గొన్నారు.