విద్యాభివృద్ధికి టిఆర్ఎస్ ప్రభుత్వం పెద్ద పీఠ..

– జడ్పిటిసి శాంతకుమారి రవీందర్.
ఊరుకొండ, సెప్టెంబర్ 12 (జనం సాక్షి):
విద్యాభివృద్ధి కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని జెడ్పిటిసి శాంత కుమారి రవీందర్ ఉన్నారు. సోమవారం నాగర్ కర్నూల్ జిల్లా ఊరుకొండ మండల కేంద్రంలోని ప్రాథమిక ఉన్నత పాఠశాలలో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన విద్యార్థులకు ఉచితంగా స్కూల్ యూనిఫార్మ్స్ ను జెడ్పిటిసి శాంతకుమారి రవీందర్, స్థానిక సర్పంచ్ కొమ్ము రాజయ్య, కో-ఆప్షన్ కలిమ్ పాషా, పాఠశాల చైర్మన్ రజిత మల్లేష్ లు విద్యార్థిని విద్యార్థులకు అందజేశారు. కార్యక్రమంలో మండల నాయకులు బ క్క జంగయ్య, కొమ్ము శీను, పులిజ్వాల చంద్రకాంత్, మొండేళ్ల శ్రీశైలం, పోలె చందు, తెరాస గ్రామ అధ్యక్షుడు పోలే నరేష్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయ సిబ్బంది, విద్యార్థిని విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.