విద్యార్థిని పట్ల అసభ్యంగా వ్యవహరించిన ప్రధానోపాధ్యాయుడు శ్రీధర్ రెడ్డి ని వెంటనే విధులనుండి తొలగించాలి.

-ఎన్ ఎస్ యూ ఐ జిల్లా అధ్యక్షుడు వెంకటేష్.
గద్వాల నడిగడ్డ, ఆగస్టు 29 (జనం సాక్షి);
విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పాల్సిన పంతులే విద్యార్థినిల పట్ల దురుసుగా ప్రవర్తించి వారి కోపద్రయ్యల లోనై ప్రధానోపాధ్యాయిని విద్యార్థిని తల్లిదండ్రులు దేహశుద్ధి చేసిన ప్రధానోపాధ్యాయిని వెంటనే విధుల నుండి తొలగించాలని జోగులాంబ గద్వాల జిల్లా డీఈవో సిరాజుద్దీన్ కు సోమవారం ఎన్ ఎన్ యు ఐ జిల్లా అధ్యక్షుడు వెంకటేష్ వినతి పత్రాన్ని అందజేశారు. విద్యా బోధనలు చేసే ఉపాధ్యాయుడే మృగం గా మారి విద్యార్థిని పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తే ఆ ప్రధానోపాధ్యాయిని పట్ల అధికారులు చర్యలు తీసుకోకపోవడం సిగ్గుచేటు అని పదవ తరగతి చదువు తున్న అమ్మాయి పై శ్రీధర్ రెడ్డి ప్రవర్తించిన తీరు చాలా తప్పు అని, అమ్మాయి కుటుంబ సభ్యులు శ్రీధర్ రెడ్డి ని దేహాశుద్ధి చేసిన మీరు ఇంకా విధుల్లో ఉంచుకోవడం సరైనది కాదు అని వెంకటేష్ అన్నారు. జోగులాంబ గద్వాల జిల్లా ఎర్రవల్లి చౌరస్తాలోని బేటాలియన్ కి సంబందించిన విద్యార్థుల తల్లితండ్రులు ఇలాంటి ఉపాధ్యాయుడు మాకు వొద్దని మా పిల్లలకు బడిలో కూడా భద్రత లేదంటే ఎలా అని అంటున్నారని, తొందరగా శ్రీధర్ రెడ్డి ని విధుల నుండి తొలగించి ప్రధాన ఉపాధ్యాయుడు పై చర్యలు తీసుకోవాలని డి ఈ ఓ కి పిర్యాదు చేయడం జరిగిందని శ్రీధర్ రెడ్డిని విధుల నుంచి తొలగించకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని ఆయన అన్నారు.ఈ కార్యక్రమం లో నాగన్న, పరమేష్, వీరేష్ తదితరులు నాయకులు పాల్గొన్నారు.