విద్యార్థులకు ఉచిత పాఠ్య పుస్తకాలు పంపిణీ.

నేరేడుచర్ల(జనంసాక్షి)న్యూస్.జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల దిర్శించర్ల నందు ప్రభుత్వం ద్వారా సరఫరా చేయబడిన ఉచిత పాఠ్యపుస్తకాల జడ్పిటిసి రాపోలు నర్సయ్య, సర్పంచ్ మాగంటి మాధవితో కలసి విద్యార్థులకు అందజేశారు.ఈ సందర్బంగా వారు,ప్రభుత్వం అందిస్తున్న సదుపాయాలను విద్యార్థులు వినియోగించుకొని చదువుల్లో రాణించాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఎస్ఎంసి చైర్మన్ వరాల,కిరణ్మయి,ప్రధానోపాధ్యాయులు బట్టు మధు, ఎస్ఎంసీ సభ్యులు కుంటి గొర్ల సైదులు,గ్రామ ప్రముఖులు మాగంటి సైదులు వరాల సైదులు,ఉపాధ్యాయులు,జి.శ్రీదేవి,వి.శ్రీనివాసరావు,జె.శ్రీనివాస్, ఎం.యాదగిరి,ఎన్ కోటిరెడ్డి, పాల్గొన్నారు.