*విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు అందజేత.

చిట్యాల 19( జనం సాక్షి) మండలంలోని నైన్ పాక గ్రామ జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాలలో విద్యార్థులకు మంగళవారం జెడ్పిటిసి గొర్రె సాగర్ చేతుల మీదుగా ఉచిత పాఠ్యపుస్తకాలను అందజేశారు. అనంతరం ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ  ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్యను అందిస్తూ ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దుతుందని కొని యాడారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎంసి చైర్మన్ నందికొండ దేవేందర్ రెడ్డి  ప్రధానోపాధ్యాయులు సుధాకర్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.