విద్యార్థులకు సహాయం చేసిన ఏబీవీపీ కార్యకర్తలు

 

బజార్ హత్నూర్ ( జనం సాక్షి ) : బజార్ హత్నూర్ సమీపంలో వంతెన పనులు పూర్తి కాకపోవడంతో తాత్కాలిక రోడ్డు మార్గం బురదమయం అవ్వడంతో విద్యార్థులు ప్రతిరోజు పాఠశాలకు రావడానికి వీల్లేకుండా ఉంది ప్రమాదకరంగా మారిన తాత్కాలిక మార్గాన్ని గమనించిన ఏబీవీపీ కార్యకర్తలు అక్కడికి చేరుకొని రాళ్లతో మార్గాన్ని ఏర్పాటుచేసి విద్యార్థులను సురక్షితంగా పాఠశాలకు తరలించారు ఏబీవీపీ కార్యకర్తలు మాట్లాడుతూ వంతెన పనులు త్వరగా ప్రారంభించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో బత్తిని సాయి కృష్ణ కొంగర్ల ప్రశాంత్ నటవే గణేష్ చందు నవీన్ కళ్యాణ్ బన్నీ గణేష్ తదితరులు పాల్గొన్నారు.