విద్యార్థులు ఉప్పెనలా కదిలిరండి

ఓయూ కీలకపాత్ర పోషిస్తుంది
టీఎస్‌ జేఏసీ చైర్మన్‌ పిడమర్తి రవి
తెలంగాణ సాధన కోసం చలో అసెంబ్లీ కార్యక్రమానికి విద్యార్థులు ఉప్పెనలా తరలిరావాలని తెలంగాణ విద్యార్థి జేఏసీ చైర్మన్‌ పిడమర్తి రవి పిలుపునిచ్చారు. తెలంగాణ సాధన కోసం నిర్వహిస్తున్న ఉద్యమం కీలక దశకు చేరిందని, ఇప్పుడు చేపడుతున్న ఉద్యమంలో ప్రతి ఒక్కరు భాగస్వాములై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి పెంచాలని కోరారు. చలో అసెంబ్లీలో ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు చలో అసెంబ్లీలో కీలక పాత్ర పోషిస్తారని తెలిపారు. తెలంగాణ ఉద్యమం తారస్థాయిలో సాగడంలో ఉస్మానియా కీలకపాత్ర పోషించిందని, అదే స్ఫూర్తిని కొనసాగిస్తామని తెలిపారు. విద్యార్థులు పది జిల్లాల నుంచి దండులా తరలివచ్చి అసెంబ్లీని ముట్టడిరచాలని కోరారు.